Sunday, April 28, 2024

Breaking : రూ.7కోట్ల ఫేక్ క‌రెన్సీ – ఏడుగురి అరెస్ట్

పోలీసులు జ‌రిపిన సోదాల్లో రూ.7కోట్ల న‌కిలీ క‌రెన్సీ నోట్లు బ‌య‌టికి వ‌చ్చాయి. ఈ మేర‌కు వీటితో సంబంధం ఉన్న ఏడుగురు వ్య‌క్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నిందితులు అంత‌ర్రాష్ట్ర ముఠాకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ముఠా నుంచి.. నకిలీ నోట్లతో పాటు ఓ ల్యాప్ టాప్, ఏడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ముంబయి శివారు ప్రాంతంలోని దహిసర్ చెక్ పోస్ట్ వద్ద నిందితులు కారును అడ్డగించినట్లు చెప్పారు.
కారులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వాహనంలోని సుమారు 250 కట్టల రూ.2వేల నోట్లు ఉన్న బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులు ఇచ్చిన సమాచారంతో అంధేరిలోని ఓ హోటల్ పై దాడి చేసి మరో ముగ్గురిని అరెస్ట్ చేశామ‌ని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement