Friday, May 17, 2024

Breaking: TRS పార్టీ రాష్ట్ర కమిటీపై కేసీఆర్ కసరత్తు

టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే అవిషయంలో ఆపార్టీ అధినేత, సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే రాష్ట్రంలోని 33 జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. తాజాగా TRS పార్టీ రాష్ట్ర కమిటీపై పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కసరత్తు మొదలు పెట్టారు. మొత్తం 40 మంది నాయకులతో కొత్త కమిటీ ఏర్పాటుకు యోచనలో ఉన్నట్లు సమాచారం. 15 మంది వరకు ప్రధాన కార్యదర్శులను, 25 మంది కార్యదర్శులను, సంయుక్త కార్యదర్శులను నియమించే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని సరిగ్గా సరిపోయే వారినే తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీలను వారం పదిరోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement