Sunday, April 28, 2024

Breaking: కేరళలో మ‌రో కొత్త‌ వైరస్.. కేర్ తీసుకోవాలంటున్న ప్రభుత్వం

Norovirus: కేరళలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. నోరో వైరస్​గా (norovirus transmission) పిలుస్తున్న ఈ వ్యాధి.. రెండు వారాల వ్యవధిలో 13 మందికి సోకిన‌ట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్రఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కూడా నిర్ధారించారు. అయితే వ్యాధి సోకిన వారంతా వయనాడ్​ జిల్లా (Wayanad district) పూకోడేలోని వెటర్నరీ కాలేజీ స్టూడెంట్స్‌గా తెలుస్తోంది.

వాంతులు, విరేచ‌నాలు (diarrhea)ను ఈ వైరస్ ​(norovirus 2021) లక్షణాలుగా గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేర‌ళ ప్రభుత్వం హెచ్చరించింది. నోరో వైరస్ (Kerala virus outbreak)​ అనేది అరుదైన వ్యాధి. కళాశాల క్యాంపస్​ బయట ఉండే హాస్టళ్లల్లోని విద్యార్థుల్లో తొలిసారి ఈ వైరస్​ను గుర్తించారు.

అప్రమత్తమైన అధికారులు.. వారి బ్ల‌డ్ శాంపుల్స్‌ని సేకరించి అలప్పుజ (Alappuzha)లోని జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్​ఐవీ)కి పంపించారు. ఈ పరిస్థితులపై అధికారులతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ (Veena George)​ భేటీ అయ్యారు. వైరస్​ గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. తాగునీటి వనరులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. సూపర్ క్లోరినేషన్ జరుగుతోందని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement