Friday, April 26, 2024

Big Breaking: ఎంపీ నవనీత్ కౌర్ దంపతులపై బాంబే హైకోర్టు ఆగ్రహం

ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. కేసును కొట్టివేయాలన్న పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. నవనీత్ కౌర్ దంపతుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. థాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా వివాదంలో నవనీత్ కౌర్ దంపతులు అరెస్టైన విషయం తెలిసిందే. ఎంపీ దంపతులకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలని తెలిపింది. ఇష్టమొచ్చిన చోట హనుమాన్ చాలీసా పఠిస్తారా.. సీఎం ఇంటి ముందు చాలీసా చదువుతారా అని హైకోర్టు ప్రశ్నించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement