Monday, April 29, 2024

Breaking: బండి పాదయాత్రకు బ్రేక్

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్రకు రెండు రోజులు విరామం ప్రకటించారు. వైద్యుల సూచన మేరకు తన ఆరోగ్యం దృష్ట్యా బండి సంజయ్ విశ్రాంతి తీసుకోనున్నారు.

కాగా, మండుటెండలో గత 12 రోజులుగా బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని నర్వ, పాతరచేడ్‌ గ్రామాల మధ్య సొమ్మసిల్లిపోయారు. దీంతో వైద్యుడు సంజయ్ చికిత్స చేశారు. ఎండల ప్రభావంతో సంజయ్ వడదెబ్బ, ఎసిడిటీకి గురయ్యారని తెలిపారు. డీహైడ్రేషన్‌, ఎసిడిటీ వల్ల బలహీనంగా ఉన్నారని, కోలుకునేంత వరకూ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ తెలిపారు. అయితే బండి సంజయ్‌ మాత్రం పాదయాత్ర ఆపేదిలేదని స్పష్టం చేస్తూ కాసేపు విశ్రాంతి తీసుకొని ముందుకు కదిలారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం దృష్ట్యా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు. యాత్రకు రెండు రోజుల పాటు విరామం ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement