Saturday, May 4, 2024

నూడుల్స్ ఫ్యాక్ట‌రీలో పేలిన బాయిల‌ర్ – ప‌ది మంది మృతి

బాయిల‌ర్ పేలడంతో ప‌ది మంది మృతి చెందారు. ఈ సంఘ‌ట‌న బీహార్ లోని ముజాఫ‌ర్ పూర్ లో నూడుల్స్ ఫ్యాక్ట‌రీలో చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో పలువురికి తీవ్ర గాయాలు అయిన‌ట్లు స‌మాచారం. మృతుల సంఖ్య మ‌రింత పెర‌గ‌నుంద‌ని అధికారులు వెల్ల‌డించారు. బాయిల‌ర్ పేల‌డంతో శ‌బ్దాలు భారీగా వినిపించాయ‌ని స్థానికులు వెల్ల‌డించారు. ఈ ప్ర‌మాదం వ‌ల్ల ఓ మిల్లు, ఓ భ‌వ‌నం ధ్వంసం అయ్యాయి. ఘ‌ట‌నాస్థ‌లికి అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. క్ష‌త‌గాత్ర‌లును హాస్ప‌ట‌ల్ కి త‌ర‌లించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement