Thursday, April 25, 2024

Green India Challenge: మొక్కలు నాటిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్

పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కి అపూర్వ స్పందన లభిస్తుంది. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లోని GHMC పార్క్ లో నిర్వహించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో సినీ, టివి రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త,రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొని సినీ,టివి ఆర్టిస్టులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సంపత్ నంది, కాదంబరి కిరణ్, టివి ఆర్టిస్ట్ నటి మీనా, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మానస్, కాజల్, జబర్దస్త్ రాకేష్, అదిరే అభి, టివి ఫెడరేషన్ ఫౌండర్ నాగ బలసూరేష్ కుమార్,టివి ఆర్టిస్ట్స్ సన, మినా, వైభవ్ సూర్య, రాజేంద్ర ,టార్జాన్, డైరెక్టర్స్ పులి వాసు, ప్రసాద్,దీప్తి బాజ్ పెయ్ తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement