Saturday, April 27, 2024

మా క్షిపణులను అడ్డుకుంటే యుద్ధం ప్రకటించినట్టే.. కిమ్ సోద‌రి జోంగ్

త‌మ క్షిప‌ణుల‌ను అడ్డుకుంటే యుద్ధం ప్ర‌క‌టించిన‌ట్టేన‌ని ఉత్త‌ర‌కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ చెల్లెలు కిమ్ యో జోంగ్ తెలిపారు. . తన సోదరుడి బాటలోనే, తాజాగా అగ్రరాజ్యం అమెరికాకు గట్టి హెచ్చరికలు చేశారు. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేపట్టడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం చెప్పారు. తాము పరీక్షించే క్షిపణులను కూల్చివేస్తే, అది ఉత్తర కొరియాపై యుద్ధం ప్రకటించినట్టుగానే భావిస్తామని కిమ్ యో జోంగ్ స్పష్టం చేశారు. ఉత్తర కొరియా వ్యూహాత్మకంగా క్షిపణి పరీక్షలు చేపడుతోందని, అందుకు వ్యతిరేకంగా అమెరికా చేపట్టే ఎలాంటి సైనిక చర్య అయినా అది యుద్ధ ప్రకటనే అవుతుందని తేల్చి చెప్పారు. తమను తక్కువ అంచనా వేయొద్దని, పసిఫిక్ మహాసముద్రంలోకి పెద్ద సంఖ్యలో క్షిపణులను ప్రయోగించగలమని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా సంస్థ కేసీఎన్ఏ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement