Tuesday, April 30, 2024

థియేట‌ర్ లో – ఫ్యాన్స్ తో క‌లిసి డ్యాన్స్ చేసిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్

భీమ్లా నాయ‌క్ చిత్రం రికార్డ్ సృష్టిస్తోంది. దాంతో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటూ డ్యాన్సులు, క‌టౌట్ల‌కు పాలాభిషేకాలు, ట‌పాసులు పేల్చుతూ థియేట‌ర్ల వ‌ద్ద‌ హోరెత్తిస్తున్నారు. వారిలో సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ కూడా క‌లిసిపోయారు. ఈ సినిమాకు ఆయ‌నే సంగీతం అందించారు. ఓ థియేట‌ర్‌లో సినిమా చూసేందుకు వెళ్లిన త‌మ‌న్.. లాల్ లాల్ భీమ్లా పాట వ‌స్తోన్న స‌మ‌యంలో తెర వ‌ద్ద‌కు వెళ్లి అభిమానుల‌తో క‌లిసి హుషారుగా డ్యాన్స్ చేశారు. దీంతో అభిమానుల్లో మ‌రింత జోష్ నిండింది. ఈ వీడియోను స్వ‌యంగా త‌మ‌న్ పోస్ట్ చేశారు. రెండో రోజు కూడా ఉద‌యం నుంచి భీమ్లా నాయ‌క్ ఆడుతోన్న సినిమా హాళ్ల వ‌ద్ద అభిమానులు ర‌చ్చ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. కొన్ని థియేట‌ర్ల వ‌ద్ద ఇసుక‌వేస్తే రాల‌నంతగా జ‌నం క‌న‌ప‌డుతున్నారు. ఏపీలో థియేట‌ర్లపై క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు అవుతున్న‌ప్ప‌టికీ భారీగానే క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి. కరోనా ప్ర‌భావం కూడా త‌గ్గ‌డంతో జాత‌ర‌కు త‌ర‌లివ‌స్తున్న‌ట్లు ప్రేక్ష‌కులు భీమ్లా నాయ‌క్ సినిమాను చూడ‌డానికి వ‌స్తున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పాటు హీరో రానా, నిత్యామీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో మెరిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement