Tuesday, April 30, 2024

బీజేపీ ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ దీక్ష‌.. రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు

హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వ‌ద్ద‌ బీజేపీ తెలంగాణ నేత‌లు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు దిగారు. బీజేపీ ఎమ్మెల్యేలసస్పెన్స్ కు నిరసనగా ఈ దీక్ష చేస్తున్నారు.  బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యేలు ఈట‌ల రాజేంద‌ర్, రాజా సింగ్‌, ర‌ఘునంద‌న్ రావుతో పాటు ప‌లువురు నేత‌లు ఈ దీక్ష‌లో పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల‌ని, నియంతృత్వాన్ని కొల్లగొట్టాల‌ని నినదిస్తున్నారు. ఈ దీక్ష సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.

అసెంబ్లీలోకి త‌మ‌ను అనుమ‌తించే అంశాన్ని పరీశీలించాని హైకోర్టు సూచన చేసిన‌ప్ప‌టికీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దాన్ని తిరస్కరించడాన్ని నిరసిస్తూ దీక్ష చేపడుతున్నట్లు బీజేపీ నేతలు మండిపడ్డారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వం ప్ర‌జాస్వామ్య సాంప్ర‌దాయాల‌ను తుంగలో తొక్కుతోంద‌ని ఆరోపించారు.

కాగా, బీజేపీ నేత‌ల దీక్షకు తొలుత పోలీసులు అనుమతి నిరాకరించారు. చివ‌ర‌కు బీజేపీ నేత‌లు కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని ఈ దీక్ష చేప‌ట్టారు. బీజేపీ దీక్ష దృష్ట్యా ఇందిరా పార్క్ వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement