Thursday, April 25, 2024

UP: ఏడేళ్ల బాలిక‌పై అత్యాచారం

ఏడేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్ప‌డిన ఘ‌ట‌న ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఇటీవ‌లే ఎన్నికలు ముగిశాయి. ఎన్నిక‌లు ముగిసిన తర్వాత మరో అవామానవీయమైన ఘటన జరిగింది. ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. అయోధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలికపై ఒక వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అయోధ్యలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిన్న రాత్రి బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ బాలిక తరుపున బంధువులు ఆందోళన చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement