Tuesday, May 21, 2024

ప‌ర్వ‌తాల‌ను మిస్ అయ్యాం – హీరో రామ్ చ‌ర‌ణ్

రీసెంట్ గా వెకేష‌న్ కు వెళ్ళారు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, ఆయ‌న భార్య ఉపాస‌న‌. రామ్ చరణ్ గత మూడేళ్లుగా ట్రిపుల్ ఆర్ సినిమా బిజీలో ఉన్నాడు. అటు ఆచార్య నిర్మాణ పనులతో పాటు ఆ సినిమాలో మెగాస్టార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. మరో వైపు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గా రాజమండ్రిలో మొదలైన ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమాల ప్రమోషన్లు.. హడావిడితో పాటు కరోనా వల్ల చాలా కాలం బయటకు వెళ్ళలేక పోయారు. ఎట్టకేళలకు కశ్మీర్ లోయల్లో ఈ సార్ జంట సందడి చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను రామ్ చరణ్ ఎప్పటి కప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉన్నాడు. మరో రెండు ఫొటోలను, ఓ వీడియోను షేర్ చేశాడు. ఫొటోల్లో తన మిత్రుడి ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్, ఉపాసన మంచులో చలి మంట కాచుకుంటున్నారు. మనసారా ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకుంటూ కనిపించారు. మరో ఫొటోలో రామ్ చరణ్ మంచుతోకప్పుకుపోయిన ఇంటి గుమ్మం వద్ద ఫొటో స్టిల్ ఇచ్చాడు. ఈ స్టైలిష్ పిక్ తన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక వీడియోలో రామ్ చరణ్ మంచులో చిన్నపాటి గుంతతవ్వి అందులోకి చేరిన నీటిని తాగుతూ కనిపిస్తాడు. ఆ నీరు చాలా టేస్టీగా ఉందని చెప్పుకొచ్చాడు. అయితే ఈ పోస్ట్ చేస్తూ ‘పర్వతాలను మిస్ అయ్యాం’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement