Sunday, April 28, 2024

పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీల నిరసన

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీలు ఈరోజు నిరసనకు దిగారు. బండి సంజయ్ అరెస్ట్ ను బీజేపీ ఎంపీలు తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే బండి సంజయ్ ను అరెస్ట్ చేసిందని ఎంపీలు ఆరోపించారు. రాష్ట్రంలో పేపర్ల లీక్ ను ప్రశ్నిస్తున్నందుకే బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. అలాగే బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్టుగా బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement