Friday, April 26, 2024

ఇంట్లో టీకా వేయించుకున్న బీజేపీ ఎంపీ.. కాంగ్రెస్ కు ఆయుధం

మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన ఇంట్లోనే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వీడియో వైరల్ కావడంతో ఆమెపై కాంగ్రెస్ పార్టీ విమర్శలకు దిగింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన ‘హోం వ్యాక్సినేషన్ డ్రైవ్‌’లో భాగంగా భోపాల్ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ తన ఇంట్లోనే వ్యాక్సిన్ వేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఆ వీడియోపై సీరియస్‌గా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రజ్ఞా ఠాకూర్ ఓ పెళ్లిలో హుషారుగా డ్యాన్సులు వేశారని, వ్యాక్సిన్ సెంటర్‌‌కు వెళ్లి టీకా వేయించుకోలేరా అని ప్రశ్నిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్ సహా బీజేపీ నేతలంతా వ్యాక్సినేషన్ సెంటర్లలోనే కరోనా టీకా వేయించుకున్నారని తెలిపారు. మరి ప్రజ్ఞాకు మాత్రం మినహాయింపు ఎందుకు? అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

https://twitter.com/NarendraSaluja/status/1415303325164081158
Advertisement

తాజా వార్తలు

Advertisement