Saturday, April 20, 2024

సందర్శనకు ఈఫిల్ టవర్..

కరోనా మహమ్మారి విజృంభణతో ఇన్నాళ్లు సందర్శనకు నోచుకోని ఈఫిల్ టవర్ ను నేటి నుంచి పర్యటకులకు అనుమతినిస్తున్నారు. దాదాపు 9 నెలల తరువాత ఈఫిల్ టవర్ కు మళ్లీ తెరుస్తున్నారు. ప్ర‌తి రోజు కేవ‌లం 13 వేల మందికి మాత్ర‌మే ట‌వ‌ర్‌ను వీక్షించే అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. సోష‌ల్ డిస్టాన్స్ పాటించే ల‌క్ష్యంతో టూరిస్టుల సంఖ్య‌ను త‌గ్గించారు. అయితే వ‌చ్చే బుధ‌వారం నుంచి విజిట‌ర్స్‌.. వ్యాక్సినేష‌న్ లేదా నెగ‌టివ్ స‌ర్టిఫికేట్‌ను చూపించాల్సి ఉంటుంది. ఇట‌లీ, ఫ్రెంచ్, స్పానిష్ విజిట‌ర్స్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ది.

ఇది కూడా చదవండి: అమెజాన్ సరికొత్త ఆఫర్.. రూ.2కే నాలుగు నెలల సబ్‌స్క్రిప్షన్

Advertisement

తాజా వార్తలు

Advertisement