Sunday, May 5, 2024

ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం వద్ద – న‌ల్ల మాస్క్ ల‌తో బిజెపినేత‌ల నిర‌స‌న‌

జోగులాంబ గద్వాల జిల్లా : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ పాదయాత్ర బుధవారం నాడు ఏడో రోజు కొనసాగింది. మల్దకల్ మండల కేంద్రానికి సమీపంలో రాత్రి బస చేసిన బండి సంజయ్ ఉదయం 9.00 గంటలకు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాల పేరుతో చేస్తున్న దాష్టీకాలను నిరసిస్తూ బసచేసిన శిబిరం వద్ద ముఖానికి నల్ల మాస్కు ధరించి అరగంట సేపు నిరసన చేపట్టారు. దీక్ష అనంతరం.. జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటాలకు నివాళులు అర్పించి ‘నిరసన దీక్ష’లో కూర్చున్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ .. డీకే అరుణ. హత్యలు..ఆత్మహత్యలు.. అత్యాచారాల పేరుతో టీఆర్ఎస్ చేస్తున్న దాష్టీకాలను నిరసిస్తూ ముఖానికి ‘నల్ల మాస్క్’ ధరించి నిరసన చేపట్టారు బండి సంజయ్, డీకే అరుణ. ఈ నిరసన దీక్షలో బండి సంజయ్ తోపాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, పలువురు బీజేపీ నాయకులు, బిజెపి పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు ఈ నిరసన దీక్షలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement