Saturday, May 4, 2024

రేవంత్ ను కలిస్తే తప్పేంటి? : బీజేపీ నేత ఈటల

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ రహస్యంగా కలిశారన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలుపై దుమారం రేపుతున్నాయి. రేవంత్, ఈటల ఇద్దరు హైదరాబాద్ లోని గోల్కొండ హోటల్‌లో కలిసినట్లు ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆరోపణలపై బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పందించారు. తాను పీసీసీ చీఫ్ రేవంత్‌ను కలిసిన మాట వాస్తవమే అని.. అయితే అది ఇప్పుడు కాదని స్పష్టం చేశారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలను కలిశానని.. అందులో భాగంగానే రేవంత్‌ను కలిశానని ఈటల తెలిపారు. అయితే రేవంత్‌ను కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు కోరలేదా అని నిలదీశారు. తెలంగాణ అభివృద్ధి కోసం పలువురు నేతలను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కేసీఆర్ వచ్చాక ఇతర పార్టీలతో బంధాలు తెగిపోయాయన్నారు. రేవంత్ రెడ్డిని కలవడం.. సంస్కార హీనమైతే కాదు కదా అని ఈటల వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: రాజీనామాకు రెడీ: పరిటాల సునీతకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్

Advertisement

తాజా వార్తలు

Advertisement