Tuesday, April 30, 2024

రాజ్యాంగాన్ని నాశ‌నం చేస్తున్న బీజేపీ.. ర‌థ‌యాత్ర‌లో అఖిలేశ్ ఫైర్‌..

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమాజ్‌వాదీ (ఎస్‌పి) అధినేత, మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ ‘మిషన్‌ 2022’ను ప్రారంభించారు. ఇందులో భాగంగా కాన్పూర్ నుంచి చేప‌ట్టిన‌ రథయాత్ర ఈ రోజు గోర‌ఖ్‌పూర్ చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు..

ఈ మ‌ధ్య జ‌రిగిన‌ లఖింపూర్‌ ఖేరి ఘటనలో బీజేపీ రైతులను చిదిమేసిందని, వచ్చే ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో తిరిగి ఆ పార్టీకి అధికారం అప్పగిస్తే రాజ్యాంగాన్ని కూడా నాశనం చేస్తుందని అఖిలేశ్ హెచ్చరించారు. సమాజ్‌వాదీ విజయ రథం ప్రజల వద్దకు వెళుతోందని, ఇక బీజేపీని తప్పకుండా గద్దె దించుతామ‌ని అన్నారు.

రైతుల హక్కులు, గౌరవాన్ని పున‌రుద్ధ‌రించేందుకు ఈ రథం ముందుకు కొనసాగుతుందని అఖిలేశ్ పేర్కొన్నారు. బీజేపీ నిరంకుశ, దేశ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ రథయాత్ర రాష్ట్రంలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేయనుంది. రథయాత్ర ప్రారంభానికి ముందుకు అఖిలేష్‌ తండ్రి ములాయం అశీర్వాదాలు తీసుకున్నారు. ఈ యాత్రకు నోట్లరద్దు సమయంలో ఒక బ్యాంకు ఎదుట క్యూలో జన్మించిన ఖజాంచి అనే చిన్నారి జెండా ఊపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement