Thursday, May 9, 2024

30న భార‌త్‌లో రెడ్‌మి నోట్ 11టీ లాంఛ్‌

భారత్‌లో న‌వంబ‌ర్ 30న రెడ్‌మి నోట్ 11టీని షియోమి లాంఛ్ చేయ‌నుంది. చైనాలో రెడ్‌మి నోట్ 11 సిరీస్‌ను కంపెనీ అక్టోబ‌ర్ చివ‌రిలో ప్ర‌వేశ‌పెట్టింది. రెడ్‌మి నోట్ 11 రీబ్రాండెడ్ వేరియంట్‌గా రెడ్‌మి నోట్ 11టీని భార‌త్‌లో షియోమి ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఇక రెడ్‌మి నోట్ 11 ప్రొ, రెడ్‌మినోట్ 11 ప్రొ+లు వ‌చ్చే ఏడాది ఆరంభంలో భార‌త్‌లో లాంఛ్ కానున్నాయి.

ఇక రెడ్‌మి నోట్ 11 6.6 ఇంచ్ ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్‌తో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ చిప్‌సెట్‌తో ఈ స్మార్ట్‌పోన్ క‌స్ట‌మ‌ర్ల‌కు అందుబాటులో ఉంటుంది. ఇక డ్యూయ‌ల్ రియ‌ర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5000ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్ధ్యంతో ఫాస్ట్ చార్జింగ్ వెసులుబాటు ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement