Thursday, May 16, 2024

బల్లియాలో బీజేపీ అభ్యర్థి దయాశంకర్‌సింగ్‌పై దాడి – ముక్తార్ అన్సారీపై ఆరోప‌ణ‌

బిజెపి అభ్య‌ర్థి, రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు ద‌యాశంక‌ర్ సింగ్ కాన్వాయ్ పై దాడి జ‌రిగింది. ఈ దాడిలో ద‌యాశంక‌ర్ సింగ్ తో క‌లిసి వెళ్తున్న బిజెపి నేత తుంజీ పాఠ‌క్ కారు ధ్వంస‌మైంది. ముక్తార్ అన్సారీ కుట్రకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. దాంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. యూపీలో అసెంబ్లీలో ఆరో ద‌శ పోలింగ్ జ‌రుగుతోంది. బిజెపి అభ్యర్థిపై దాడి జరిగడంతో .. బిజెపి మద్దతుదారులు అప్రమత్తం అయ్యారు..దాంతో దాడి చేసిన వ్యక్తులు పారిపోయారు. వారి వెంట ఉన్న భద్రతా సిబ్బంది వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement