Saturday, May 11, 2024

Breaking: ఏపీ ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుద‌ల

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. ఈసంద‌ర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ మాట్లాడుతూ… జేఈఈ ప‌రీక్ష‌ల షెడ్యూల్ దృష్ట్యా ఇంట‌ర్ ప‌రీక్ష‌లు వాయిదా వేసిన‌ట్లు తెలిపారు. ఏప్రిల్ 22 నుంచి నిర్వ‌హించేలా షెడ్యూల్ విడుద‌ల చేశారు. ఏప్రిల్‌ 22న పరీక్షలు మొదలై మే 12 వరకు జరుగనున్నాయి. విద్యా శాఖ ఇటీవల ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు జరగాల్సి ఉంది. జేఈఈ మెయిన్‌ పరీక్షలను ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు నిర్వహిస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ రెండు రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీ విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మరో వైపు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలను గతంలో ప్రకటించిన తేదీల్లోనే (మార్చి 11 నుంచి మార్చి 31) జరుగుతాయని సురేశ్‌ తెలిపారు. కొవిడ్ నిబంధనల మేరకే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించి బోర్డు తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 1,400 పరీక్షా కేంద్రాలు, 900 ల్యాబ్‌లను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఇన్విజిలేషన్‌కు సిబ్బంది సమస్య లేదని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement