Wednesday, May 8, 2024

Big Breaking : అమెరికాలో టోర్న‌డోల బీభ‌త్సం : వంద‌మందికి పైగా మృతి


అమెరికాలో టోర్న‌డోల బీభ‌త్సం సృష్టించింది. కెంట‌కీ రాష్ట్రంలో అపార న‌ష్టం వాటిల్లింది. ఐదు రాష్ట్రాల్లో 24టోర్న‌డోలు వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న‌లో వంద‌మందికి పైగా మృతి చెందారు. టోర్న‌డోల‌తో భారీగా ఇళ్లు నేల‌మ‌ట్టం అయ్యాయి. దాంతో అక్క‌డ స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభ‌మ‌య్యాయి. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.ఆగ్నేయ యూఎస్ దేశంలోని కెంటకీ రాష్ట్రంలో సుడిగాలి కారణంగా అనేక కౌంటీలు ధ్వంసమయ్యాయని గవర్నర్ ఆండీ బెషీర్ తెలిపారు. కెంటకీ చరిత్రలోని ఇది అత్యంత భీభత్సమైన టోర్నెడోలు అని ఆయన అన్నారు. ఒక్క మేఫీల్డ్ నగరంలోనే కొవ్వత్తుల పరిశ్రమ పైకప్పు కూలి దాదాపు 50 మంది మరణించారు. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని భారీ అమెజాన్ గిడ్డంగి తుఫాను ధాటికి తీవ్రంగా దెబ్బతింది. దాదాపు 100 మంది కార్మికులు లోపల చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. యూఎస్ లో దాదాపు 5 రాష్ట్రాల్లో టోర్నెడోలు భీభత్సం సృష్టించాయి. అర్కాన్సాస్, ఇల్లినాయిస్ మిస్సౌరీ మరియు టేనస్సీల రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తీవ్రంగా టొర్నెడోలు వస్తున్నాయి. కాగా టోర్నెడోలు ఎక్కువగా వస్తున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎమర్జెన్సీని విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement