Thursday, April 25, 2024

ముఖ్యమంత్రి సహయనిధి పేదలకు వరం : మంత్రి తలసాని

సికింద్రాబాద్, ( ప్రభ నూస్) : ముఖ్యమంత్రి సహాయ నిధి పేద‌ల‌కు వ‌ర‌మ‌ని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో ముగ్గురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ఆర్ధిక సహాయం మంజూరు (ఎల్ ఓసీ) పత్రాలను అందజేశారు.

బన్సీలాల్ పేట డివిజన్ బీజేఆర్ నగర్ కు చెందిన సాయి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాడు. వైద్య చికిత్స కోసం అవసరమైన ఆర్ధిక సహాయం అందించి ఆదుకోవాలని సాయి కుటుంబ సభ్యులు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను కలిసి కోరారు. మంత్రి చొరవతో లక్ష రూపాయలు మంజూరు కాగా అందజేశారు. అదేవిధంగా సీసీ నగర్ కు చెందిన అభిషేక్ కు రూ.50 వేలు, బేగంపేట డివిజన్ బ్రాహ్మణ వాడకి చెందిన కె.ప్రకాష్ కు లక్షా 25 వేల రూపాయలు మంజూరు కాగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు తరుణి, అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement