Saturday, May 11, 2024

నైజామ్ లో ‘భీమ్లా నాయక్’ రచ్చ.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రలో నటించిన ‘భీమ్లా నాయక్’ భారీ కలెక్షన్ కొల్లగొడుతోంది. ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడులైంది. తొలి రోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతోంది.
తొలి రోజున నైజామ్ లో భీమ్లా నాయక్ సినిమా 11.80 కోట్ల షేర్ ను సాధించింది. ఇవి ఆల్ టైమ్ రికార్డు వసూళ్లని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వీకెండ్ కావడంతో ఈ రోజు, రేపు కూడా ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

‘వకీల్ సాబ్’ మూవీ తర్వాత కొంచం గ్యాప్ తీసుకుని భీమ్లా నాయక్ గా పవన్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ భీమ్లా నాయక్ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను, సితార బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. పవన్, రానాల ప్రాతలు ఢీ అంటే ఢీ అన్నట్లు ఉంది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు, తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుతో సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

https://twitter.com/taran_adarsh/status/1497417135823286272
Advertisement

తాజా వార్తలు

Advertisement