Sunday, April 28, 2024

భిక్షాట‌న కోసం – రూ.90వేల త్రిచక్ర మోటారు మోపెడ్ ని కొనుగోలు చేసిన వృద్ధ దంప‌తులు

పిల్ల‌లు ఉన్నా త‌ల్లిదండ్రుల‌ని రోడ్ల‌పై వ‌దిలేసే వారు ఎంద‌రినో చూస్తూనే ఉన్నాం. కాగా ఓ వృద్ద దంప‌తులు భిక్షాట‌న కోసం ఏకంగా రూ.90వేలు పెట్టి త్రిచక్ర మోటారు మోపెడ్ ని కొనుగోలు చేశారు. ఈ దంపతుల వయసు 60కు దగ్గర పడింది. భిక్షాటనే వారికి జీవనోపాధి. మధ్యప్రదేశ్ లోని చింద్వారా జిల్లా కేంద్రంలో వీరు ట్రై సైకిల్ (మూడు చక్రాల సైకిల్) ద్వారా భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. సంతోష్ కుమార్ సాహుకు కాళ్లలో వైకల్యం ఉంది. అందుకే అతడు మూడు చక్రాల సైకిల్ పై కూర్చుని హ్యాండిల్ పట్టుకుంటే.. అతడి భార్య సైకిల్ ను వెనుక నుంచి నెట్టేది. ఆలయాలు, మసీదుల వద్ద వీరు అడ్డుక్కునేవారు. అయితే, వయసు పెరగడం, కచ్చా రోడ్లు, ఎత్తయిన చోట్ల సైకిల్ ను తోయాల్సి రావడంతో సాహు భార్యకు నడుము నొప్పి వేధించసాగింది. ఆమె నొప్పితో నరకాన్ని అనుభవిస్తుంటే సాహు చూడలేకపోయాడు. ఇంతకాలం రూపాయి, రూపాయి అడుక్కుని కూడబెట్టుకున్న సొమ్ముతో త్రిచక్ర మోటారు మోపెడ్ ను కొనుగోలు చేశాడు. దాంతో ఇద్దరూ కలసి సులభంగా ఎక్కడికైనా చేరుకుని భిక్షాటన వృత్తిని చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement