Tuesday, May 21, 2024

బీచ్ డేట్ లో అనుష్క‌.. కోహ్లీ

కుటుంబంతో స‌ర‌దాగా గ‌డుపుతున్నాడు టీం ఇండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ. భార్య అనుష్క శర్మతో కలిసి బీచ్‌ డేట్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోను శనివారం సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్‌ వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ ఫ్యామిలీ టైంని ఎంజాయ్‌ చేస్తున్నారు. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే రెండు వన్డేల్లో గెలిచిన టీమిండియా.. నామమాత్రపు మూడో వన్డే ఈనెల 15న (ఆదివారం) తిరువనంతపురంలో జరగనుంది. దీంతో మ్యాచ్‌కు కాస్త సమయం ఉండటంతో విరాట్‌.. కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement