ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్రెబొంద గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రమేష్ ను మావోయిస్టులు చంపేశారు. ఈ మేరకు బుధవారం ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్టులను మోసం చేసేలా వ్యవహరించింనందునే రమేష్ ను చంపినట్లు మావోయిస్టు కార్యదర్శి శాంత ఆ లేఖలో పేర్కొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన వ్యక్తి కుర్సం రమేష్ నిన్న (మంగళవారం) కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే.
తమ సమాచారాన్ని పోలీసులకు రమేష్ అందించారని.. మావోయిస్ట్ పార్టీకి తీరని ద్రోహం చేశారని విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. అందుకే తాము రమేష్ ను చంపేసినట్టు స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారు ఎవరైనా.. ఇక మీదట పునరావృతం అయితే వారిని కూడా శిక్షిస్తామని హెచ్చరించారు. కాగా.. వృత్తి రీత్యా రమేష్ డ్రైవర్ గా పని చేస్తున్నట్టు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..