Monday, May 6, 2024

ఇండియాలో ప్ర‌శ్నించిన వారిపై దాడులు.. రాహుల్ గాంధీ సంచ‌న‌ల వ్యాఖ్య‌లు

భార‌త్ లో కొత్త సిద్ధాంతం అమ‌లు చేస్తున్నార‌ని తెలిపారు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారన్నారు.బ్రిటన్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు. లండన్ లో ఆయన ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఐజేఏ)తో సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. జర్నలిస్టులను బెదిరిస్తున్నారని, వారిపై దాడులు చేస్తున్నారన్నారు రాహుల్ గాంధీ. ప్రభుత్వానికి అనుకూలంగా నడుచుకోకపోతే ఇలాగే జరుగుతుందని, బీబీసీకి ఎదురైన పరిస్థితి కూడా ఆ కోవలోకే వస్తుందని వివరించారు. గత 9 ఏళ్లుగా భారత్ లో ఉన్న పరిస్థితి ఇదేనని స్పష్టం చేశారు. భారత్ లోని దళితులు, బలహీన సామాజిక వర్గాల ప్రజలు నోరెత్తకూడదని బీజేపీ భావిస్తోందని, దేశ సంపదనంతా నలుగురైదుగురికి పంచాలని ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement