Sunday, April 28, 2024

మద్యం మత్తులో ఉన్న వ్యక్తి దాడి చేసినట్లు గుర్తింపు

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త ఘటన చోటు చేసుకుంది. మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్‌హాసన్ కారుపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేయడం కలకలం రేపింది. ఆదివారం రాత్రి కాంచీపురంలో కమల్ ఎన్నికల ప్రచారం ముగించుకుని వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. జనసమూహంలో కమల్ కారు నిదానంగా వెళుతుండగా ఓ వ్యక్తి రాళ్లతో దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇది గమనించిన ఎంఎన్ఎం కార్యకర్తలు ఆ వ్యక్తిని చితకబాదారు. సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గాయాలపాలైన అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఎంఎన్ఎం వర్గాలు మాత్రం ఇది కమల్‌పై దాడికి యత్నమే అని ఆరోపిస్తున్నాయి. ఈ దాడి వెనక ఉద్దేశమేంటో పార్టీ విచారణలో తేలుతుందని చెప్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement