Friday, May 3, 2024

పాత బ్రాండ్లు అమ్మకపోతే ఇకపై ఓటు వేయమంటూ అల్టీమేటం

ఏపీ సీఎం జగన్‌కు నంద్యాల ఓటర్లు హెచ్చరించారు. ఆదివారం నాడు మున్సిపల్ ఓట్ల లెక్కింపు సందర్భంగా నంద్యాల 29వ వార్డు బ్యాలెట్‌ బాక్సుల్లో కొన్ని స్లిప్పులు సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇంతకీ ఆ స్లిప్పులో ఏం ఉందంటే.. ‘నంద్యాల తాగుబోతుల విన్నపం.. మద్యం అమ్మకాల్లో కొత్త బ్రాండ్లు అయిన సుప్రీం, దారు, హైదరాబాద్‌, జంబో వంటి వాటిని తొలగించి.. పాత బ్రాండ్లు అయిన రాయల్‌ స్టాగ్‌, ఇంపీరియల్‌ బ్లూ, బ్లాక్‌ డాగ్‌ రకాల అమ్మకాలు జరపాలని విన్నపం. లేకపోతే ఇదే మా చివరి ఓటు అవుతుంది’ అంటూ హెచ్చరించారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి దీనిపై సీఎం జగన్ ఎలా స్సందిస్తారో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement