Monday, April 29, 2024

మెదక్ బిషప్ పై హత్యాయత్నం.. చ‌ర్చి క‌మిటీ ఎన్నిక‌ల్లో స‌పోర్ట్ చేయ‌లేద‌న్న క‌క్ష‌తోనే!

ప్రపంచ పఖ్యాతి గాంచిన మెదక్ చర్చ్ బిషప్ ఏసీ సాల్మన్ రాజు పై ఆదివారం హత్యాయత్నం జరిగింది. ఈ విషయం పై ఆయన మాట్లాడుతూ… త‌న‌కు ప్రాణహాని ఉందని తెలిపారు. ఈ హత్యాయత్నానికి పాల్పడింది చర్చి సభ్యులే అన్నారు. గత నెల అక్టోబర్ ఒకటో తేదీన జరిగిన చర్చి కమిటీ ఎన్నికల్లో తాను ఒక వర్గానికి మద్దతు ఇవ్వగా ప్రత్యర్థి వర్గం వారు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపారు.

ఆదివారం ఆరాధన కార్యక్రమానికి తాను వెళ్ల‌గా దాదాపు 30 మంది కత్తులతో తన వాహనాన్ని చుట్టుముట్టారని, వారిని చూసి కేకలు వేయడంతో త‌న అనుచరులు సకాలంలో స్పందించార‌ని, దీంతో ప్ర‌మాదం నుంచి తప్పించుకున్నారని తెలిపారు. తనపై హత్యా య‌త్నం చేసిన‌ వారిలో దాదాపు 18 మంది పేర్లను ఆయన వెల్ల‌డించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement