Sunday, May 5, 2024

Breaking: మరో రెండు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కరీంనగర్ కు చెందిన ఎన్ఆర్ఐ అనిల్ కుర్మాచలంకు, తెలంగాణ స్టేట్ రెనేవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ములుగు జిల్లాకు చెందిన
వై. సతీష్ రెడ్డిని నియమించారు. నూతనంగా నియమితులైన కార్పొరేషన్ చైర్మన్లు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement