Tuesday, April 30, 2024

సంగం డెయిరీ కేసు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

సంగం డెయిరీ కేసులో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వు చేసింది. ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీ చైర్మన్ గా ఉన్నారు. అయితే ఆయన హయాంలో భారీగా అవకతవకల జరిగాయంటూ కేసు నమోదు చేసిన ఏసీబీ అరెస్ట్ చేసింది. తనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం పట్ల ధూళిపాళ్ల హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తీర్పును హైకోర్టు రిజర్వ్ లో ఉంచింది. 

మరోవైపు ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలను టార్గెట్ చేసిందని ఆరోపిస్తున్నారు. తమను ఆర్థికంగా కుంగదీసే చర్యలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. పాడిరైతులకు ఎంతో లబ్ది చేకూర్చుతున్న సంగం డెయిరీని దెబ్బతీసి అమూల్ కు మేలు చేసే చర్యలకు పాల్పడుతున్నారని, అన్యాయంగా సంగం డెయిరీపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే, టీడీపీ ఆరోపణలను వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. సంగం డెయిరీ పేరుతో ధూళిపాళ్ల వేల కోట్లు దోపిడీ చేశాడని అంటున్నారు. రైతులకు చెల్లింపులు చేయకుండా అన్యాయం చేస్తున్నారని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement