Saturday, April 27, 2024

ఏపీలో పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారా? రద్దు చేస్తారా?

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అయితే తాము సంసిద్ధత వ్యక్తం చేసినంత మాత్రాన ప్రభుత్వ నిర్ణయం ఇదేనని చెప్పలేమన్నారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించి సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఇప్పటికే ఇంటర్ ప్రాక్టికల్స్ చేపట్టి, థియరీ పరీక్షల దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తామనో, రద్దు చేస్తామనో ఇప్పటికిప్పుడే చెప్పలేమని మంత్రి తెలిపారు. విద్యాసంస్థల్లో కరోనా కేసులు పెరుగుతున్నది నిజమేనని చెప్పారు. అయితే అవేమీ వందల సంఖ్యలో కాదని, కేవలం పదుల సంఖ్యలోనే నమోదవుతున్నాయని తెలిపారు. కరోనా సోకిన వారిని వెంటనే ఐసోలేషన్ కు తరలిస్తూ, వైద్య చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.

మరోవైపు దేశంలో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగిపోవడంతో సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలోనూ పది, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేసి, ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపైనా క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. ఏపీలో కరోనా కేసులు నిత్యం వేల సంఖ్యలో నమోదవుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement