Friday, April 26, 2024

odisha : ఒడిశాలో మ‌రో రైలు ప్ర‌మాదం…

ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌లో ఇటీవల ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనను ప్ర‌జ‌లు మ‌రువ‌క ముందే ఒడిశాలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని బార్‌ఘర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ రైలులో సున్నపురాయిని తీసుకెళ్తున్నారు. అయితే గూడ్స్ రైలులోని అనేక వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే రైలు పట్టాలు తప్పడంతో.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement