Friday, April 19, 2024

2కే వాక్ లో పాల్గొని.. మొక్క‌లు నాటిన ఎంపీ సంతోష్ కుమార్

హైదరాబాద్: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బేగంపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ క్యాంపస్ లో 2కే వాక్, గ్రీన్ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్వ‌హించారు. ఈకార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన అనంతరం 2కే వాక్ ను ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీసీ కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్, ఉస్మానియా యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ రవీందర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ డైరెక్టర్ విజయలక్ష్మి, విద్యార్థులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement