Tuesday, May 14, 2024

Ibrahimpatnam: కాల్పుల ఘటనలో మరొకరు మృతి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ గ్రామ శివారు వద్ద ఈరోజు ఉద‌యం జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌లో మ‌రొక‌రు మృతిచెందారు. రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన గొడవకు సంబంధించి ఈరోజు ఉద‌యం కాల్పుల జ‌రిగిన‌ప్పుడే శ్రీనివాస్ రెడ్డి స్పాట్ లోనే మృతిచెందిన విష‌యం విదిత‌మే. అయితే ఈ ఘ‌ట‌న‌లో కాల్పుల‌కు గురైన రాఘ‌వేంద‌ర్ రెడ్డి అనే వ్య‌క్తి చికిత్స పొందుతూ చ‌నిపోయాడు.


శ్రీనివాస్ రెడ్డి, రాఘ‌వేంద‌ర్ రెడ్డి క‌లిసి ఇబ్ర‌హీంప‌ట్నం ప‌రిధిలోని లేక్ వ్యూస్‌కు స‌మీపంలో వెంచర్ వేసిన‌ట్లు వారి స‌న్నిహితులు తెలిపారు. అయితే ఈ ఉద‌యం ఆ వెంచ‌ర్‌లో బోర్ వేయించేందుకు వీరిద్ద‌రూ వెళ్లిన‌ట్లు చెప్పారు. ఆ స‌మ‌యంలోనే శ్రీనివాస్ రెడ్డి, రాఘ‌వేంద‌ర్ రెడ్డిపై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్పులు జ‌రిపిన‌ట్లు వారి స‌న్నిహితులు పేర్కొన్నారు. అయితే మట్టారెడ్డితో శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డికి వాగ్వాదంతో కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులు మట్టారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనపై ఇబ్రహీంపట్నం ఏసీపీ విచారణ చేపట్టారు. కారులో ఉన్న మూడో వ్యక్తి ఎవరన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పరిశీలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement