Friday, May 3, 2024

Breaking: ఉక్రెయిన్ లో మరో భారతీయుడి మృతి

ఉక్రెయిన్ లో మ‌రో భార‌తీయుడు మృతిచెందాడు. గ‌త వారం రోజులుగా ర‌ష్యా వ‌ర్సెస్ ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. అయితే ఈ యుద్ధం కార‌ణంగా చ‌దువుకునేందుకు అక్క‌డికి వెళ్లిన విద్యార్థులు తిరిగి భార‌త్ కు చేరుకుంటున్నారు. అయితే అక్క‌డ జ‌రుగుతున్న యుద్ధంలో నిన్న క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన న‌వీన్ అనే విద్యార్థి క్షిపణిదాడిలో చ‌నిపోయిన విష‌యం విదిత‌మే. అయితే ఈరోజు మ‌రో భార‌తీయుడు ఉక్రెయిన్ లో చ‌నిపోయాడు. ఈరోజు చ‌నిపోయిన విద్యార్థి పంజాబ్ కు చెందిన చంద‌న్ జిందాల్ గా గుర్తించారు. అయితే ఈ యువ‌కుడు అనారోగ్యంతో మృతిచెందాడ‌ని స‌మాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement