Monday, May 6, 2024

ఏపీలో కరోనా ప్రళయం.. ఒక్కరోజులో 101 మంది బలి

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 94,550 కరోనా శాంపిళ్లను పరీక్షించగా ఏకంగా 24,171 కేసులు నమోదయ్యాయి. ఇక కొత్తగా 101 మంది చనిపోయినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. వీటితో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,35,491కి చేరుకోగా.. మరణాల సంఖ్య 9,372కి చేరింది.

ప్రస్తుతం ఏపీలో 2,10,436 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు: శ్రీకాకుళం-1,509, విజయనగరం-997, విశాఖ-2,200, తూ.గో.-2,041, ప.గో.-2,426, కృష్ణా-705, గుంటూరు-1,787, ప్రకాశం-1,628, నెల్లూరు-1,593, చిత్తూరు-2,885, అనంతపురం-3,356, కడప-1,638, కర్నూలు-730.

Advertisement

తాజా వార్తలు

Advertisement