Wednesday, May 15, 2024

హైకోర్టుకు చేరిన రఘురామ వైద్యపరీక్షల నివేదిక

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కాలికి గాయాలు కావడంపై గుంటూరు జీజీహెచ్‌లో ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వైద్య నివేదికను మెడికల్ బోర్డు జిల్లా కోర్టుకు నివేదించగా జిల్లా కోర్టు ఆ నివేదికను పరిశీలించి అనంతరం హైకోర్టుకు అందజేసింది. రఘురామ వైద్య పరీక్షల నివేదికను ఓ ప్రత్యేక మెసెంజర్ ద్వారా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ నివాసానికి పంపింది. హైకోర్టు ఈ మెడికల్ రిపోర్టును పరిశీలించి కాసేపట్లో నిర్ణయం వెలువరించే అవకాశాలున్నాయి. అంతకుముందు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తికావడంతో ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఆయన వైద్య పరీక్షల నివేదికపై విచారణ అనంతరం హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement