Tuesday, May 7, 2024

ఏపీలో కొత్తగా 22,018 కరోనా కేసులు, 96 మంది మృతి

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 89,087 కరోనా శాంపిళ్లను పరీక్షించగా ఏకంగా 22,018 కేసులు నమోదయ్యాయి. ఇక కొత్తగా 96 మంది చనిపోయినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. వీటితో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,88,803కి చేరుకోగా.. మరణాల సంఖ్య 9,173కి చేరింది.

ప్రస్తుతం ఏపీలో 2,03,787 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు: శ్రీకాకుళం-695, విజయనగరం-899, విశాఖ-2,200, తూ.గో.-3,432, ప.గో.-1,436, కృష్ణా-1,031, గుంటూరు-1,733, ప్రకాశం-1,265, నెల్లూరు-1,733, చిత్తూరు-2,708, అనంతపురం-2,213, కడప-1,460, కర్నూలు-1,213.

Advertisement

తాజా వార్తలు

Advertisement