Friday, May 3, 2024

గోల్డెన్ బాయ్ కి మహీంద్ర సూపర్ గిఫ్ట్

టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన యువ అథ్లెట్ నీరజ్ చోప్రాకు దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనుంది. నీరజ్ చోప్రాకు మహీంద్రా ఎక్స్‌యూ‌వి700 ఎస్‌యూ‌విని బహుమతిగా ఇవ్వానున్నట్లు మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర ప్రకటించారు. ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించినందుకు ఆనంద్ మహీంద్రా అభినందనలు తెలిపారు. 

కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి తొలి స్వర్ణ పతకం అందించి చరిత్రలో నిలిచిపోయాడు నీరజ్ చోప్రా. ఫురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో పోటీపడిన నీరజ్ చోప్రా 87.58 మీటర్లతో బంగారు పతకాన్ని గెలుపొందాడు. వంద ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం సాధించిన భారతీయ అథ్లెట్‌‌గా రికార్డు సృష్టించాడు. జావెలిన్ త్రోలో ప్రత్యర్థులెవరూ నీరజ్ చోప్రా దరిదాపుల్లోకి కూడా రాలేదు. 

మహీంద్రా కంపెనీ ఎక్స్‌యూ‌వి700 ఎస్‌యూ‌విని లాంచ్ ముందుగానే ప్రచారం చేస్తోంది. ఈ సంవత్సరంలో అత్యంత ఎదురుచూస్తున్న లాంచ్‌లలో ఈ కారు ఒకటి. మహీంద్రా ఈ సంవత్సరం ఆగస్టు 15న ఎక్స్‌యూ‌వి 700ని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనుంది. 

ఇది కూడా చదవండి: ఫ్యాక్ట్ చెక్: పార్టీ మార్పుపై ఎమ్మెల్యే రాజయ్య క్లారిటీ

Advertisement

తాజా వార్తలు

Advertisement