Sunday, April 28, 2024

అమితాబ్ బ‌చ్చ‌న్ ఇంట్లో క‌రోనా క‌ల్లోలం – 31మంది సిబ్బందికి పాజిటీవ్

రోజు రోజుకి క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. కాగా రీసెంట్ గా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. ముంబైలోని అమితాబ్ నివాసంలో ప‌ని చేస్తోన్న ఓ ఉద్యోగికి క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. దాంతో మిగ‌తా సిబ్బందికి కూడా క‌రోనా టెస్ట్ లు చేయించ‌గా 31మందికి క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. దాంతో వారంద‌రిని హోం ఐసోలేష‌న్ లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు స‌మాచారం. సిబ్బందికి కరోనా సోకడంతో అమితాబచ్చన్ ఇంట్లో ఉన్న వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. కాగా 2020 సంవత్సరం లో అమితాబ్ బచ్చన్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement