Saturday, May 4, 2024

Breaking: అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

దేశంలోనే ఎత్తైన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని అంబేద్కర్ మనమడు ప్ర‌కాశ్ అంబేద్క‌ర్‌తో క‌లిసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. బౌద్ధ గురువుల  ప్రార్ధనల మధ్య  తెలంగాణ  సీఎం కేసీఆర్ అంబేద్కర్ విగ్రహన్ని ఆవిష్కరించారు. పండగ వాతావరణంలో రాజ్యంగ నిర్మాత విగ్రహాన్ని ఆవిష్కరించేలా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రుల, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

దేశంలోనే అత్యంత భారీ అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. విగ్రహావిష్కరణ ముందు హెలికాఫ్టర్ ద్వారా అంబెడ్కర్ విగ్రహంపై పూల వర్షం కురిపించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ జై భీమ్ అని నిన‌దించారు. అక్క‌డున్న ప్ర‌జాప్ర‌తినిధులంతా చ‌ప్పట్ల‌తో పూలవ‌ర్షాన్ని స్వాగ‌తించారు. అంబేద్క‌ర్ విగ్ర‌హా శిలాఫ‌ల‌కాన్ని ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ ఆవిష్క‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement