Saturday, April 27, 2024

ఆరు రోజులు ముందుగానే వాయిదా ప‌డిన.. పార్ల‌మెంటు ఉభ‌య‌స‌భ‌లు

ఆరు రోజులు ముందుగానే వాయిదా ప‌డ్డాయి పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు. నిజానికి షెడ్యూల్ ప్రకారం అయితే ఈ నెల 29 వరకు సమావేశాలు కొనసాగాల్సి ఉంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 7న మొదలు కావడం తెలిసిందే. సమావేశాల ముగింపు నిర్ణయాన్ని బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో తీసుకున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, అధికార, ప్రతిపక్షాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సమావేశాలలో 97 శాతం ఉత్పాదకత రేటు నమోదైనట్టు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. మొత్తం 62 గంటల 42 నిమిషాల పాటు పనిచేసినట్టు చెప్పారు. చివరి రోజు శుక్రవారం కూడా పార్లమెంటులో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ నియంత్రణ రేఖ వద్ద చైనా, భారత్ బలగాల ఘర్షణ అంశం ఈ విడత సమావేశాలను కుదిపేసిన వాటిల్లో ప్రధానమైనది. దీన్ని అడ్డం పెట్టుకుని అధికార బీజేపీని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. దాంతో చైనాకు గట్టి సమాధానం చెప్పామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement