Sunday, May 5, 2024

భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు.. రాములోరి దర్శనం ఇలా..

భద్రాద్రిలో రేపటి నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు నిర్వహించనన్నారు. సోమవారం నుంచి ఈ నెల 23 వరకు ముక్కోటి ఏకదశి వరకు మహోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా పగల్ పత్తు, రాపత్తు, వాలస ఉత్సవాలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి రోజుకో రూపంలో శ్రీరామచంద్రస్వామి దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా పగల్‌ పత్తు, రాపత్తు, విలాస ఉత్సవాలు నిర్వహించన్నారు.

రేపు మత్య్సావతారం, 4వ తేదీన కూర్మావతారం, 5న వరాహావతారం, 6న నరసింహావతారం, 7న వామనావతారం, 8న పరశురామావతారం, 9న శ్రీరామావతారం, 10న బలరామవతారం, 11న శ్రీకృష్ణావతారంలో స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక, 12వ తేదీన గోదావరిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. అలాగే, 13వ తేదీన ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement