Wednesday, May 1, 2024

సంక్షేమం ఆగదు..పరిశ్రమల ప్రవాహం తప్పదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలో సంక్షేమం ఆగదని, పరిశ్రమల ప్రవాహం తప్పదని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు పట్టణం ఆర్డిఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ పింఛన్ కానుక కార్యక్రమంలో మంత్రి మేకపాటి పాల్గొన్నారు. ఆత్మకూరులో పెరిగిన పింఛన్ ను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వాలంటీర్ల ద్వారా నేరుగా ప్రతి నెలా ఇంటికే పింఛన్లు అందిస్తున్నామని అన్నారు. వితంతు మహిళలు, వికలాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, వృద్ధులు కూడా ఎవరిపై ఆధారపడని విధంగా పింఛన్ల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ ఇవ్వనంత మందికి పింఛన్లు అందిస్తున్నామన్నారు.

పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి చలించి వాటిని తొలగించాలన్న తపనతో సీఎం జగన్ నవరత్నాలను తీసుకువచ్చారని చెప్పారు. నెలకు రూ.1570 కోట్లు, ఏడాదికి రూ.20 వేల కోట్లు పింఛన్ల పంపిణీకే ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వివరించారు. రాష్ట్రంలో 60 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామన్నారు. అవ్వతాతల బాగోగులను సీఎం చూసుకుంటారన్నారు. మీ మనుమలు, మనుమరాళ్ల భవిష్యత్ గురించి నేను చూసుకుంటానని మంత్రి చెప్పారు. రూ.25 కోట్లతో నారంపేట ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు అభివృద్ధి చేస్తామన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని నారంపేటలో పరిశ్రమలను క్యూ కట్టిస్తాం అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement