Friday, April 26, 2024

యువ‌కుడిపై యువ‌తి యాసిడ్ దాడి..చూపుకోల్పొయిన అరుణ్ కుమార్..

ప్రేమించి మోసం చేసినందుకు ఓ యువ‌తి..యువ‌కుడిపై యాసిడ్ పోసిన ఘ‌ట‌న కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురంలో చోటు చేసుకుంది. తిరువనంతపురంలో నర్సుగా పనిచేస్తున్న షీబాకు మూడేళ్ల క్రితం ఫేస్ బుక్ లో అరుణ్ కుమార్ అనే వ్యక్తి పరిచమయ్యాడు. అయితే ఇటీవల షీబాకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసి అరుణ్ కుమార్ ఆమెకు దూరమయ్యే ప్రయత్నం చేశాడు. దాంతో షీబా అరుణ్ కుమార్ పై క‌సి పెంచుకుంది.ఒక‌సారి మాట్లాడాలంటూ అరుణ్ కుమార్ ని పిలిచి అత‌నిపై యాసిడ్ దాడికి పాల్ప‌డింది. యాసిడ్ దాడిలో తీవ్ర గాయాలపాలయ్యాడు. అదే సమయంలో షీబాపై కూడా యాసిడ్ పడటంతో గాయాలపాలైంది. తీవ్రంగా గాయపడ్డ అరుణ్ కుమార్ ఒక కంటి చూపును కోల్పోయాడు. ప్రస్తుతం బాధితుడు తిరువనంతపురం మెడికల్ కాలేజీలో వైద్యం పొందుతున్నాడు. సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. షీబాపై కేసు న‌మోదు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement