Sunday, April 28, 2024

RR | యువతి దారుణ హత్య.. కండ్లలో కత్తితో పొడిచి చంపి, నీటి కుంటలో ప‌డేశారు

పరిగి, (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లాలో ఓ యువ‌తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యింది. పరిగి మండలం కాళ్ల‌ పూర్ లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష (19) దారుణ హత్యకు గురైంది. శిరీష శనివారం రాత్రి (సుమారు 10 గంటల సమయంలో) ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఇవ్వాల (ఆదివారం) ఆ యువతి గ్రామ శివారులోని నీటి కుంటలో శవమై తేలింది. యువతి తలపై, కళ్ళలో క‌త్తితో పొడిచి దారుణంగా చంపేసిన‌ట్టు తెలుస్తోంది. ఆ త‌ర్వాత దుండగులు శవాన్ని నీటి కుంటలో పడేశారు.

ఆదివారం మధ్యాహ్నం నీటి కుంట దగ్గర యువతి దుస్తులను గుర్తించిన స్థానికులు పోలీసులకు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కుంటలో నుండి యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. యువతి మృతదేహంపై కత్తి ఘాట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన యువతి వికారాబాద్ కేంద్రంలో పారా మెడికల్ కోర్సు చేస్తోంది. అయితే.. రెండు నెలల నుండి కుటుంబ సభ్యులు కళాశాలకు వెళ్లకుండా అడ్డుకుని ఇంటిద‌గ్గ‌రే ఆపేశారు.

సంఘటనా స్థలానికి డి.ఎస్.పి కరుణాసాగర్ రెడ్డి చేరుకొని పరిశీలించారు. స్థానికులను, కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమగ్ర విచారణ చేసి నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డి.ఎస్.పి వెంట ఎస్సై విట్టల్ రెడ్డి సిబ్బంది ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement