Thursday, May 2, 2024

Big Breaking: ఆర్టీసీ బస్సు ను ఢీకొట్టిన లారీ, ఒక‌రు మృతి.. జ‌గిత్యాల జిల్లాలో ఘ‌ట‌న‌

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. బుధవారం రాత్రి జగిత్యాల డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుండి జగిత్యాలకు వస్తుండగా రాజారం వద్ద జగిత్యాల నుండి కరీంనగర్ వెళ్తున్న లారీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ చ‌నిపోయింది. కొంత‌మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ పరిశీలించి క్ష‌తగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement